సుదీర్ఘమైన నడక, నది దాటడం వలన సుభాష్ బాగా అలసిపోయాడు. నిద్ర కూడా వచ్చేస్తోంది. కానీ రోడ్డుమీద ఏదైనా లారీనైనా పట్టుకుని ఆ ప్రాంతం నుంచి బయట పడటం అత్యవసరం. భగత్ రాం లారీని ఆపాడు. పెద్ద పెద్ద తేయాకు పెట్టెల మీద కూర్చుని, రివ్వున తగిలే చలిగాలిని తట్టుకుంటూ రాత్రంతా కిలోమీటర్ల దూరం ప్రయాణం. రోడ్లమీద ఉన్న చెట్ల కొమ్మలు ఒక్కోసారి తలకి తగిలేవి. ఆ భయానికి నిద్రపోవడానికి వీలు లేదు. ఆహారం కూడాలేదు. కేవలం అక్కడక్కడా టీ తాగి ప్రాణాలు నిలబెట్టుకోవాల్సి వచ్చేది. 'బడ్ ఖట్' చేరాక, అక్కడ పాస్ పోర్టుల తనిఖీ జరిగింది. వారి ప్రయాణానికి కారణమేమిటని అధికారులు గుచ్చి, గుచ్చి ప్రశ్నించారు. సుభాష్ ను చూపించి, తన సోదరుడు చెవిటి, మూగ కాబట్టి 'సఖీ సాహెబ్ ' సమాధి దగ్గర ఆశీర్వాదానికి తీసుకువెళుతున్నానని భగత్ రాం అలియాస్ రహమత్ ఖాన్ చెప్పాడు. చివరికి 'ఖాన్ సాహెబ్ ' పరిచయలేఖ గట్టెక్కించింది. జనవరి 31 నాటికి మితృలిద్దరూ కాబూల్ చేరారు. కాబూల్ వచ్చినంత మాత్రాన సుభాష్ సమస్యలు పరిష్కారం కాలేదు. నిజానికవి మరింత తీవ్రమయ్యాయి. మితృలిద్దరూ కాబూల్ లో ఒల సత్రంలో మకాం వేశారు. అక్కడ పోలీసు ఏజంట్లు తగిలారు. వారికి కొంత నగదు రూపేణా లంచం సమర్పించుకుని సుభాష్ బయటపడ్డాడు. ఆశ్రయం లేని అపరిచిత ప్రదేశంలో అడుగుడుగునా...పోలీసుల, బ్రిటిష్ గూడచారుల కళ్ళు గప్పుతో తాను చేరదలచుకున్న దేశానికి చేరుకోవడం అంత తేలిక లక్ష్యమేమీ కాదు.
ఇదిలా ఉండగా ఇక్కడ భారత్ లో జనవరి 26 మొదటి సారిగా సుభాష్ చంద్రబోస్ తప్పించికుని వెళ్లిన సంగతి ప్రపంచానికి వెళ్లడైంది. కోర్టు పని మీద సుభాష్ న్యాయవాది ఆయన్ని కలవాలని ప్రయత్నించి ఆయన గదికి వెళ్లి చూసినపుడు ఆయన తప్పించుకుని వెళ్లి పోయిన విషయం ప్రపంచానికి స్పష్టమైంది. జన. 27 నాటి దినపత్రికలు పెద్ద అక్షరాలతో సుభాష్ అదృశ్యం వార్తల్ని ప్రచురించాయి. ఆయన దేశం వదిలి తప్పించుకోకుండా దేశంలో రైల్వేస్టేషన్లకు, విమానాశ్రయాలకు, ఓడరేవులకు ఈ సమాచారాన్ని పంపించి, కట్టుదిట్టం చేశారు. దేశవ్యాప్తంగా పోలీసు యంత్రాంగమంతా అప్రమత్తమైంది. నిర్బంధం మధ్యనుంచి సుభాష్ అదృశ్యం కావడం పోలీసు వ్యవస్థకే సవాల్ గా ప్రభుత్వం భావించింది. ఈ విషయాలన్నీ రేడియో ద్వారా ఎప్పటి కప్పుడు సుభాష్ చంద్ర బోస్ తెలుసుంటునే ఉన్నాడు. సుభాష్ భారత్ ను విడిచి వెళ్లేముందు బ్రిటిష్ వారిని అయోమయంలో పడేసేందుకు వేసిన ఎత్తుగడ మరొకటి ఉంది. తప్పించుకునే ముందే, రాబోయే నెలల తేదీలతో ముందుగానే కొందరు మితృలకి సుభాష్ కొన్ని లేఖలు రాసి ఉంచాడు. ఆ లేఖల్ని ఆయా తేదీల్లో తన మితృలకి పోస్ట్ అయ్యేలా ఏర్పాట్లు చేసుకున్నాడు. సహజంగానే ఆ లేఖలు బ్రిటిష్ సెన్సార్ వ్యవస్థ చేతిలో పడతాయని సుభాష్ ఊహించాడు. తాను దేశం వదిలి వెళ్లిపోయిన విషయం బ్రిటిష్ ప్రభుత్వానికి వెన్వెంటనే తెలియరాదని సుభాష్ పన్నిన ఎత్తుగడ అది.
కాబూల్ నుంచి సోవియెట్ కు, అక్కడినుంచి జర్మనీ వరకూ సుభాష్ సాహసయాత్ర ముందు చూద్దాం.
Comments
2 comments to "ది గ్రేట్ ఎస్కేప్ - II"
December 2, 2008 at 9:39 AM
very nice narration... waiting for next posts....
December 2, 2008 at 12:11 PM
for better and truthful history your work is awesome, keep on
Post a Comment